న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం నుంచి సోమవారం నాటికి 24 గంటల్లో 636 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసులు 4,394కి చేరా యి. తాజాగా ముగ్గురు మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా జేఎన్.1 కేసులు 196 నమోదయ్యాయి. అత్యధికంగా కేరళలో 83, గోవా (51), గుజరాత్ (34), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1), ఢిల్లీ (1) ఉన్నాయి.