ముంబై: మహారాష్ట్రలోని పుణెలో (Pune) ఘోర ప్రమాదం జరిగింది. ఆరు నెలల చిన్నారి ట్రాక్టర్ టైర్ల కింద నలిగిపోయింది. పుణె-నాసిక్ హైవేపై రాజ్గురునగర్ వద్ద ఓ ట్రాక్టర్ వేగంగా వెళ్తున్నది. దానిని ఓవర్ టేక్ చేయడనికి ఓ బైక్ ప్రయత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి బైక్ కిందపడిపోయింది. దీంతో మోటారు సైకిల్ను నడుపుతున్న వ్యక్తితోపాటు మహిళ, ఆమె ఒడిలో ఉన్న ఆరు నెలల చిన్నారి రోడ్డుపై పడిపోయారు. అయితే వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఆ చిన్నారి పైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ పాప అక్కడికక్కడే మృతిచెందింది. అంతసేపు ఒడిలో ఉన్న పాప తన కళ్లముందే చనిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
पुणे जिल्ह्यातील राजगुरुनगर मध्ये सहा महिन्याच्या चिमुकलीचा ट्रॅक्टरच्या चाकाखाली येवून मृत्यू झाला आहे.दुचाकीवर आईच्या कुशीत बसुन निघालेल्या सहा महिन्यांच्या कोवळ्या मुलीचा मृत्युची घटना सीसीटीव्हीमध्ये चित्रित झाली आहे.#CCTV #Viral #Video #ViralVideo #Pune #MTReel pic.twitter.com/YXUCwtUGrF
— Mumbai Tak (@mumbaitak) September 23, 2022