ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా వనాంచల్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లాలో నక్సలైట్లు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. ఘటనాస్థలి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, వస్తు సామగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల శిబిరాన్ని కూడా కూల్చేశాయి.