అహ్మదాబాద్: గుజరాత్లోని ఆనంద్ (Anand) జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నది. ఆనంద్ జిల్లాలోని దాలీ గ్రామంలో వేగంగా వస్తున్న కారు అదుపుతప్ప ఆటో, బైకులను ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు, మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు ఉన్నారని చెప్పారు. కారు డ్రైవరు తీవ్రంగా గాయపడటంతో అతడిని దవాఖానకు తరలించారు.
కారు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ గుప్తా చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన కారు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సోజిత్రా ఎమ్మెల్యే పూనమ్భాయ్ మాధాబాయ్ పర్మార్ అల్లుడికి చెందినదిగా గుర్తించామన్నారు.