న్యూఢిల్లీ, నవంబర్ 2: ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్నాథ్, ఒడిశా-ధామ్నగర్, మహారాష్ట్ర-అంధేరి ఈస్ట్ ఉన్నాయి.
వీటిల్లో పలు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడం, మరికొన్నింటిలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.