న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: దేశంలో గుంతల రోడ్ల కారణంగా మరణించిన వారి సంఖ్య గత ఐదేండ్ల కాలంలో 53 శాతం పెరిగింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ 2020 నుంచి 2024 మధ్య దేశంలో 9,438 మంది మరణించారని, ఇందులో 54 శాతం మరణాలు ఉత్తరప్రదేశ్లోనే చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
యూపీలో దేశంలోనే అత్యధికంగా 2020 నుంచి 2024 మధ్య 5,127 మంది మరణించారని, కేవలం 2024లోనే రోడ్లపై గుంతల కారణంగా 1,369 మంది మృతి చెందినట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ ఉందన్నారు. ఏపీ, బీహార్, గోవాల్లో గత ఐదేండ్లలో గుంతల కారణంగా ఎలాంటి మరణాలు సంభవించ లేదని చెప్పారు.