డెహ్రాడూన్, మే 24: 15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర్ శుక్రవారం చెప్పారు.
ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, 14 మంది బద్రినాథ్లో, 23 మంది కేదార్నాథ్లో మరణించారని వివరించారు. 50 ఏండ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేశామన్నారు.