JN.1 | భారత్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు అమాంతం పెరిగాయి. ఏకంగా 500 దాటాయి. జనవరి 2వ తేదీ వరకూ కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు దేశవ్యాప్తంగా 511కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మొత్తం 11 రాష్ట్రాల్లో ఈ కేసులు బయటపడినట్లు తెలిపాయి.
ఈ తరహా కేసులు కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క కర్ణాటక రాష్ట్రంలో 199 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కేరళలో 148 కేసులు, గోవాలో 47, గుజరాత్లో 36, మహారాష్ట్రలో 32, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్థాన్లో నాలుగు, తెలంగాణలో రెండు, ఒడిశా, హర్యానాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి.
Also Read..
Chaddannam | అమెరికాలో చద్దన్నానికి యమా క్రేజ్.. ధర తెలిస్తే షాకే..!
Leopard | అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన చిరుత.. వీడియో
Coronavirus | 24 గంటల్లో 602 కొత్త కేసులు.. ఐదు మరణాలు