తిరువనంతపురం: సుమారు 50 శాతం వందే భారత్ రైళ్లు (Vande Bharat trains) ఖాళీగా లేదా పాక్షికంగా నిండిన సీట్లతో నడుస్తున్నాయని కేరళ కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలోని వివిధ మార్గాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్ల ఛార్జీలు ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని విమర్శించింది. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ బుకింగ్ డేటాను విశ్లేషించింది. సెలవుల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా రైళ్ల రద్దీ, ప్రయాణాలు పెరిగినప్పటికీ, వందే భారత్ బుకింగ్లు ఆశ్చర్యకరంగా తక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో వందే భారత్ రైళ్లు పేలే బుడగ వంటివని కేంద్ర ప్రభుత్వంపై మండిపడింది.
కాగా, దేశంలోని ఆర్థిక అసమానతలకు సంబంధించిన ధోరణిని ఈ డేటా హైలైట్ చేస్తున్నదని కేరళ కాంగ్రెస్ విశ్లేషించింది. ఇతర రైళ్ల వెయిటింగ్ లిస్ట్లను వందే భారత్ రైళ్ల బుకింగ్ డేటాతో పోల్చింది. సంపన్న ప్రాంతాల వారు వందే భారత్లో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల ప్రజలు ఖరీదైన ఈ రైలు సేవలు పొందలేకపోతున్నారని పేర్కొంది.
మరోవైపు దేశంలో రైళ్లకు బాగా డిమాండ్ ఉన్నప్పటికీ ఛార్జీలు ఎక్కువ కావడంతో వందే భారత్ రైళ్లు ప్రజలకు అక్కరకు రాకుండా పోతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గరీబ్ రథ్ టిక్కెట్ ధర రూ. 770 ఉండగా వందే భారత్ టిక్కెట్ ధర రూ. 1,720గా ఉందని పేర్కొంది. దీంతో సాధారణ ప్రయాణికులకు నిషేధంగా ఈ రైలు ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో మిగతా రైళ్లు కిక్కిరిసిన జనంతో ప్రయాణిస్తున్నాయని పేర్కొంది.
కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం వందే భారత్పైనే ఎక్కువగా దృష్టిసారించడం దీనికి కారణమని కేరళ కాంగ్రెస్ విమర్శించింది. అందుకే ఖరీదైన వందే భారత్ రైళ్లు ఖాళీగా నడుస్తున్నాయని పేర్కొంది. వైవిధ్యమైన ప్రయాణీకుల జనాభాకు సేవలు అందించడం రైల్వేకు అవసరమని స్పష్టం చేసింది. జనాభాలో చాలా మంది భరించగలిగినప్పుడు వందే భారత్ రైళ్లు మంచివని అభిప్రాయపడింది. అయితే అందుకు దేశ ఆర్థిక వృద్ధి చాలా ముఖ్యమని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్లో వరుస ట్వీట్లు చేసింది. అలాగే సాధారణ రైళ్లలో ప్రయాణికుల రద్దీకి సంబంధించిన వీడియో క్లిప్ను షేర్ చేసింది. అసలైన గణాంకాలతో ముందుకు రావాలని ఈ పోస్ట్పై స్పందించిన రైల్వే మంత్రిని సవాల్ చేసింది.
VANDE BHARAT | We've decided to prick the 'Vande Bharat' bubble. Analysis of IRCTC booking data reveals that over 50% of Vande Bharat runs either operate with empty or partially filled seats.
This data, sourced from IRCTC just hours before train departures, focuses solely on the… pic.twitter.com/MqlO8wuHKj
— Congress Kerala (@INCKerala) May 8, 2024
Thank you for your response, @AshwiniVaishnaw.
The 98% figure lacks context. Occupancy can exceed 200%. For instance, if a passenger travels from Kasargod to Kozhikode, another from Kozhikode to Kochi, and a third from Kochi to Thiruvananthapuram, the seat's occupancy is 300%.… https://t.co/O3kYC0ts3O pic.twitter.com/J0e3S0NQ3E
— Congress Kerala (@INCKerala) May 9, 2024