దేవరకొండ, జూన్ 22 : భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం హరితహారంలో భాగంగా పట్టణ పరిధిలోని జాతీయరహదారి వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యత చేపట్టాలని సూచించారు. ఈ సందర్భం గా రోడ్డు వెంట సుమారు 300 మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్అలీ, కమిషనర్ వెంకటయ్య, రైతుబంధు మండల కన్వీనర్ శిరందాసు కృష్ణయ్య, ఏఈ రాజు, కోఆప్షన్ సభ్యుడు జింకల లింగయ్య, కౌన్సిలర్లు రైస్, పొన్నబోయిన భూదేవీసైదులు, జయప్రకాశ్నారాయణ, నాయకులు సైదులు, వేముల రాజు, ప్రదీప్, తౌఫిక్, పల్లెపు అశోక్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా దేవరకొండ ఖిల్లా
దేవరకొండ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఖిల్లాలో జరుగుతున్న పార్కు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఖిల్లాపై రూ.5 కోట్లతో 5 ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోటి రూపాయలతో సీసీరోడ్డు నిర్మించనున్నట్లు చెప్పారు. పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
నేడు పీఏపల్లిలో ఎమ్మెల్యే పర్యటన
పెద్దఅడిశర్లపల్లి : దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ బుధవారం మండలానికి రానున్నట్లు ఎంపీడీఓ యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. బాలాజీనగర్లో వైకుంఠధామాన్ని ప్రారంభించడంతో పాటు దుగ్యాల, వడ్డెరగూడెం గ్రామాల్లో సైడ్డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.