Amrit Bharat Train | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: అమృత్ భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తున్న క్రమంలో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. అమృత్ భారత్ రైలు సర్వీస్ భారీ విజయం సాధించిందని, దీంతో మరిన్ని రైళ్లకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు. అన్నీ నాన్ ఏసీ బోగీలు ఉండే రెండు అమృత్ భారత్ రైళ్లను గత ఏడాది డిసెంబర్లో ప్రారంభించారు.