కోల్కతా, జూన్ 30: సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయనందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు రూ.5 వేల జరిమానా విధించింది. గత నెలలో నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో తమ పార్టీ నాయకులు ముగ్గుర్ని అరెస్ట్ చేసినప్పుడు సీబీఐ కార్యాలయం ముందు మమత నిరసన తెలిపారు. దీనికి సంబంధించి ఆమె సకాలంలో అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆలస్యంగా జూన్ 9న దాఖలు చేయగా హైకోర్టు తిరస్కరించింది. చివరకు జరిమానాతో అఫిడవిట్ దాఖలుకు అవకాశం కల్పించింది.