భువనేశ్వర్: ఒక ప్రభుత్వ కాలేజీలో సీనియర్ల ర్యాగింగ్ శృతిమించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ర్యాగింగ్తో సంబంధం ఉన్న 12 మంది విద్యార్థులను ఆ కాలేజీ డిస్మిస్ చేసింది. ఒడిశాలోని బెర్హంపూర్లో ఈ సంఘటన జరిగింది. బినాయక్ ఆచార్య ప్రభుత్వ కాలేజీలో మంగళవారం లంచ్ బ్రేక్ సందర్భంగా ర్యాగింగ్ జరిగింది. నెల కిందట కాలేజీలో కొత్తగా చేరిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని 12 మంది సీనియర్లు వేధించారు. ఆమెకు ముద్దు పెట్టాలని ఒక విద్యార్థిని బలవంతం చేశారు. ర్యాగింగ్కు పాల్పడిన గ్రూప్లో నలగురు బాలికలు కూడా ఉన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ఫిర్యాదుతో ఐదుగురు విద్యార్థులపై పలు సెక్షన్లతోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒక విద్యార్థి మేజర్ కాగా మిగతా నలుగురు మైనర్లు.
మరోవైపు ర్యాగింగ్ గ్రూప్లోని 12 మంది విద్యార్థులను ఆ కాలేజీ నుంచి డిస్మిస్ చేశారు. వారికి టీసీలు ఇచ్చి పంపేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డిగ్రీ విద్యార్థి, 24 ఏళ్ల అభిషేక్పై ఇప్పటికే మరో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో ఒక మహిళను వేధించిన కేసులో అరెస్టైన అతడు బెయిల్పై విడుదలైనట్లు చెప్పారు. ఒడిశాలోని అధికార బీజేడీ విద్యార్థి విభాగం సభ్యుడైన అతడు ఆ కాలేజీ క్యాంపస్ కమిటీకి నామినేట్ అయినట్లు వెల్లడించారు.
Ragging and molestation of a girl student in Berhampur Odisha, in front of everyone in broad daylight. And the prime accused was the ruling party BJD's college convener.
Law & order in the state has gone for a toss! Where are we heading as a society? 😢 pic.twitter.com/i09I7w3bgz
— KeepitDope_Suv (@_JoshNeverStops) November 18, 2022