Jharkhand | రాంచీ : జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్( Encounter ) చోటు చేసుకుంది. పలాము – చత్రా సరిహద్దులో పోలీసులకు( Police ), మావోయిస్టులకు( maoists ) మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో నక్సలైట్ గౌతం పాసవాన్తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులతో పాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన గౌతం పాసవాన్పై రూ. 25 లక్షల రివార్డు ఉంది. చనిపోయిన మరో ఇద్దరు నక్సలైట్లపై రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.
అయితే పలాము – ఛత్రా సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ క్రమంలో భద్రతా బలగాలను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. జవాన్లు కూడా అప్రమత్తమై కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందారు.