లక్నో: బీహార్లోని అరారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరారియా వద్ద సోమవారం ఉదయం ఓ ఆటోను ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.
మరో ప్రమాదంలో.. ఇద్దరు చిన్నారులు సహా ఎనిమిది మృతిచెందారు. గుజరాత్లోని అమ్మేలీ జిల్లా బధాడాలో సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఓ టక్కు రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. దీంతో ఎనిమిది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.