Cat | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిపోయిన పిల్లిని (Cat) రక్షించేందుకు వెళ్లి ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అహ్మద్ నగర్ (Ahmednagar)లో మంగళవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అహ్మద్నగర్లో ఉన్న ఓ పాడుబడ్డ బావి (abandoned well)ని బయోగ్యాస్ (biogas) కోసం వినియోగిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం సమయంలో ఓ పిల్లి అనుకోకుండా అందులో పడిపోయింది. దాన్ని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు. ఆరుగురు వ్యక్తులు నడుముకు తాడు కట్టుకొని ఒకరి తర్వాత ఒకరు బావిలోకి దూకారు. అనుకోకుండా అందులో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఓ వ్యక్తిని కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అతడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
Also Read..
Woman Lawyer | కస్టమ్స్ అధికారుల పేరుతో మహిళా న్యాయవాదికి బెదిరింపులు.. రూ.10లక్షలు దోపిడీ
Arvind Kejriwal | ఈడీ అరెస్ట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్