Earthquake | కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ (Ladakh)లో భూకంపం (Earthquake) సంభవించింది. కార్గిల్ (Kargil) జిల్లాలో సోమవారం రాత్రి భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.2గా నమోదైనట్లు తెలిపింది. కార్గిల్కు వాయువ్యంగా 148 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.
ఈ భూకంపం ధాటికి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు. మరోవైపు లడఖ్లో ఆదివారం రాత్రి నుంచి అక్కడక్కడా మంచు పడుతోంది.
Also Read..
Operation Valentine | ఐఏఎఫ్ అధికారిగా అదరగొట్టిన వరుణ్తేజ్.. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ విడుదల
Rahul Gandhi | పరువునష్టం కేసులో రాహుల్కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన యూపీ కోర్టు
Lok Sabha elections | లోక్సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు పూర్తి.. మార్చి 9 తర్వాత షెడ్యూల్ విడుదల..!