కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ బంక్లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ్ సింగ్ నివ్వెరపోయారు. ఈ ఘటన వివరాలను చరణ్ సింగ్ వివరిస్తూ, తొలుత అక్కడి సిబ్బంది 41 లీటర్ల పెట్రోల్ నింపారని, తరువాత వారు మెషీన్ను మానిప్యులేట్ చేసి, మరో 11 లీటర్లు కలిపారని ఆరోపించారు.
చరణ్ సింగ్ ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కుమ్మక్కై, ఈ మోసం సాగిస్తున్నారని ఆరోపించారు. 45 లీటర్ల ట్యాంకులో 52 లీటర్ల పెట్రోల్!
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ బంక్లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ్ సింగ్ నివ్వెరపోయారు. ఈ ఘటన వివరాలను చరణ్ సింగ్ వివరిస్తూ, తొలుత అక్కడి సిబ్బంది 41 లీటర్ల పెట్రోల్ నింపారని, తరువాత వారు మెషీన్ను మానిప్యులేట్ చేసి, మరో 11 లీటర్లు కలిపారని ఆరోపించారు. చరణ్ సింగ్ ఈ విషయమై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేశారు. తూనికలు, కొలతల శాఖ అధికారులతో కుమ్మక్కై, ఈ మోసం సాగిస్తున్నారని ఆరోపించారు.