బెంగళూరు: కర్ణాటకలో 45 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సంచలన ప్రకటన చేశా రు. ఇంటెలిజెన్స్ నివేదికను పేర్కొంటూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ 136 సీట్లు గెలుచుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు సీఎం, మంత్రులు జేడీఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన అన్నారు.
క్యాబినెట్ మార్పులపై సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య నిందారోపణలు కొనసాగడం, సీఎం పదవిపై కొందరు నేతలు ఆశ పడిన నేపథ్యంలో కుమారస్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి.