నైనిటాల్, ఏప్రిల్ 10: ఉత్తరాఖండ్లోని హల్దానీలో ఉన్న జైలులో 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా తేలింది. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు.
అప్రమత్తమైన జైలు సిబ్బంది వీరందరికి చికిత్స అందిస్తున్నారు. మిగతా ఖైదీలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ జైలులో 1,629 మంది పురుష ఖైదీలు, 70 మంది మహిళా ఖైదీలు ఉన్నారు.