అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉన్నది. ఇవాళ 4,108 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. మొత్తం 22,882 శాంపిల్స్ను పరీక్షించగా అందులో నాలుగువేల పైచిలుకు మందికి పాజిటివ్గా తేలింది. దాంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,10,388కి చేరింది. ఇక సోమవారం ఉదయం 9 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 696 మంది కరోనా బాధితులు ఆ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు.
ఇవాళ్టి రికవరీలతో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 20,65,696కు పెరిగింది. ఇదిలావుంటే ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 3,18,84,914 శాంపిల్స్ను పరీక్షించారు. ప్రస్తుతం 30,182 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ మృతుల సంఖ్య 14,510గా ఉన్నది. ఇక జిల్లాల వారీగా చూస్తే 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధికంగా 1,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా 1,004 కేసులతో రెండో స్థానంలో ఉన్నది.