శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ షోపియాన్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లాలోని జైనాపోరా ప్రాంతంలోని బడిగ్రామ్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు సైతం ప్రతిగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో నలుగురు మృతి చెందారని, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఎన్కౌంటర్కు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.