అహ్మదాబాద్: గుజరాత్లోని కచ్ సరిహద్దుల్లో నలుగురు పాకిస్థానీ మత్స్యకారులను (Pak Fishermen) బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. కచ్లోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలో ఉన్న హరామి నల్లా వద్ద దేశంలో అక్రమంగా ప్రవేశించిన మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు.. భుజ్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తుండగా భారత భూభాగంలోకి చొరబడుతున్న ఫిషింగ్ బోట్లను గుర్తించారు. దీంతో వాటిని వెంబడించి నలుగురిని అరెస్టు చేశారు. పది బోట్లను సీజ్ చేశారు. వాటిలో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు.