న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఒమిక్రాన్ (Omicron) కలకలం కొనసాగుతున్నది. ఢిల్లీలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. దీంతో హస్తినలో మొత్తం కేసులు 10కి చేరాయి. ప్రస్తుతం తొమ్మిది మంది బాధితులు ఎల్ఎన్జేపీ దవాఖానలో చికిత్స పొందుతుండగా, మరోకరు వైరస్ నుంచి కోలుకుని బుధవారం సాయంత్రం డిశ్చార్జీ అయ్యారు.
కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూస్తుండటంతో ఢిల్లీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ రాజధాని పరిధిలో నిషేదాజ్ఞాలు అమలుచేస్తున్నది. వచ్చే నెల 1 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. బార్లు, రెస్టారెంట్లు 50 శాతం కెపాసిటితో నడుపుకోవాలని, బాంక్వెట్ హాల్స్కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నది. కాగా, ఢిల్లీలో నాలుగు కొత్త కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 77కు చేరింది.