ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా షిండే చెంతకు చేరుతున్నారు. బుధవారం ఉదయం వరకు స్వంతంత్రులతో కలిపి 40 మంది ఎమ్మెల్యేలు షిండే పక్షం ఉండగా, తాజాగా మరో నలుగురు అసమ్మతి శిభిరంలో చేరారు. దీంతో షిండే మద్దతుదారుల సంఖ్య 46కు చేరింది. నలుగురు ఎమ్మేల్యేలు సూరత్ నుంచి గువాహటి చేరుకున్నారు.
కాగా, శివసేనలో ప్రారంభమైన ముసలంతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం పతనంవైపు పయణిస్తున్నది. ఎమ్మెల్యేలు కోరితో తాను సీఎం పదవికి, పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. బుధవారం రాత్రి అధికారిక నివాసం ‘వర్షా’ బంగ్లాను ఖాళీ చేసిన ఉద్ధవ్.. కుటుంబసభ్యులతో కలిసి బాంద్రాలోని సొంత నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు.
#WATCH | Assam: Shiv Sena leader Eknath Shinde along with other MLAs at Radisson Blu Hotel in Guwahati last night, after 4 more MLAs reached the hotel. pic.twitter.com/1uREiDXNr5
— ANI (@ANI) June 23, 2022