Earthquake | గుజరాత్లోని కచ్ జిల్లాలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
23.65° నార్త్ లాటిట్యూడ్, 70.23° ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్యలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది. భూ ప్రకంపనలు రాగానే అక్కడి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంప ప్రభావిత ప్రాంతంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని అధికారులు వెల్లడించారు.
EQ of M: 4.4, On: 26/12/2025 04:30:02 IST, Lat: 23.65 N, Long: 70.23 E, Depth: 10 Km, Location: Kachchh, Gujarat.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/22QSBf5XDd— National Center for Seismology (@NCS_Earthquake) December 25, 2025
గుజరాత్లోని కచ్ జిల్లా భూకంపాలకు వెరీ హై రిస్క్ జోన్గా చెబుతుంటారు. తక్కువ ప్రకంపనలతో ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 2001లో ఇక్కడ భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో 13,800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1.67 లక్షల మంది గాయపడ్డారు.