జైపూర్: రాజస్థాన్లోని బికనేర్లో (Bikaner) స్వల్ప భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో బికనీర్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు సంభవించాయని వెల్లడించింది. భూకంప కేంద్రం బికనేర్కు 236 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొన్నది. తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
శనివారం తెల్లవారుజామున లక్నోలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిన సందర్భం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్ పితోరాగ్రాఫ్లో కూడా భూమి కంపించింది.