న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. దేశంలో దాదాపు ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి ఆన్లైన్ మోసాల బారినపడ్డట్టు ‘లోకల్ సర్కిల్స్’ జరిపిన సర్వేలో వెల్లడైంది. 331 జిల్లాల్లో 32 వేల కుటుంబాలను సర్వే చేయగా వీరిలో గత మూడేండ్లలో 39 శాతం కుటుంబాలు ఆన్లైన్ మోసాలకు గురైనట్టు తేలింది.
నకిలీ షాపింగ్ వెబ్సైట్ల ద్వారా డబ్బులు తీసుకొని వస్తువులు డెలివరీ చేయకుండా 13 శాతం మోసాలు జరిగినట్టు తేలింది. 10% ఏటీఎం కార్డులకు, మరో 10 శాతం బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన మోసాలు జరగగా, 16 శాతం ఇతర ఆన్లైన్ మోసాలు జరిగాయి.