న్యూఢిల్లీ, మార్చి 14: భారత్ కాలుష్య కోరల్లో చిక్కుకొన్నది. ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 ఇండియాలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ మంగళవారం ఈ ర్యాంకులను వెల్లడించింది.
పాకిస్థాన్లోని లాహోర్, చైనాలోని హోటన్ నగరాలు అత్యంత కాలుష్య నగరాల్లో మొదటి రెండుస్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్లోని భివాడి మూడో స్థానంలో, ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. టాప్ 10లో ఆరు భారతీయ నగరాలు, టాప్ 20లో 14 ఉండడం గమనార్హం.