(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలో నెలకొన్న ఉద్యోగ సంక్షోభం సెగ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా పేర్కొనే ఐఐటీలనూ తాకింది. ఐఐటీల్లో విద్యనభ్యసించిన 38 శాతం మంది విద్యార్థులకు ఈ ఏడాది ఇంకా ప్లేస్మెంట్ లభించలేదు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి ధీరజ్సింగ్ ఆర్టీఐ ద్వారా సేకరించిన ఈ వివరాలను సోషల్మీడియాలో వెల్లడించారు.