తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్నది. ప్రతిరోజు భారీసంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం సాయంత్రం ఐదు గంటల నుంచి గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు గడిచిన 24 గంటల్లో కేరళలో మొత్తం 38,607 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.
ఇదిలావుంటే, గడిచిన 24 గంటల వ్యవధిలో 48 కరోనా మరణాలు కూడా నమోదయ్యాయని పినరయి విజయన్ చెప్పారు. తాజా మరణాలతో కలిపి కేరళలో మొత్తం మరణాల సంఖ్య 5,259కి చేరిందన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు కరోనా బారినపడి కోలుకున్న వారి సంఖ్య 12,44,301కి చేరిందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఆక్సిజన్ జనరేటర్లుగా నైట్రోజన్ ప్లాంట్స్..! : ఐఐటీ బాంబే
కరోనా వైరస్కు ప్రధాని మోదీయే సూపర్ స్ప్రెడర్..!
ప్రధాని నరేంద్రమోదీతో ఆర్మీ చీఫ్ నరవానె భేటీ
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి