న్యూఢిల్లీ: దేశంలో కరోనా (Corona) కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 3545 కేసులు నమోదవగా, కొత్తగా 3805 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,30,98,743కు చేరాయి. ఇందులో 4,25,54,416 మంది డిశ్చార్జీ అయ్యారు. మరో 5,24,024 మంది మృతిచెందగా, 20,303 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 22 మంది కరోనాతో మరణించగా, 3168 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక ఇప్పటివరకు 1,90,00,94,982 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. ఇందులో నిన్న ఒకేరోజు 17,49,063 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది. మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, 98.74 శాతం మంది కోలుకున్నారని, 1.22 శాతం మంది మృతిచెందారని వెల్లడించింది.