న్యూఢిల్లీ: ఏకలవ్య స్కూళ్లకు భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జరగనున్నది. రానున్న మూడేళ్లలో ఆ స్కూళ్లకు 38 వేల మంది టీచర్లను రిక్రూట్ చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇవాళ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆమె ఈ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
In the next three years the center will recruit 38,800 teachers and support staff for the 740 Eklavya Model Residential Schools serving 3.5 Lakh tribal students: Finance Minister @nsitharaman #AmritKaalBudget #UnionBudget2023 pic.twitter.com/ntI64Voanp
— PIB India (@PIB_India) February 1, 2023