ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడలాడిస్తున్నది. ముంబైలోని బైకులా జైల్లో ఇవాళ 38 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. షీనా బోరా హత్యకేసులో దోషిగా తేలిన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జి కూడా ప్రస్తుతం ఆ జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నది. కరోనా పాజిటివ్ వచ్చిన 38 మంది ఖైదీల్లో ఇంద్రాణి కూడా ఉన్నారు. బైకులా జైలు అధికారులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మంత్రి సత్యవతి పూజలు
ఈ నెల 30 వరకు బ్రిటన్కు విమాన సర్వీసులు బంద్ : ఎయిర్ ఇండియా
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
బెంగాల్లో B.1.618 వేరియంట్ దడ..