కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లో 36 మంది కేరళవాసులు ( Kerala ) చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ సురక్షితంగా భారత్కు తీసుకురావాలని కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐ సంస్థకు .. కాబూల్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, ఆ నగరంలో 36 మంది కేరళీయులు చిక్కుకున్నట్లు తెలుస్తోందని విజయన్ ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ లేఖను కూడా సమర్పించింది. నార్కా సంస్థ తమ వద్ద ఉన్న సమాచారాన్ని కేంద్రానికి చేరవేసింది. మరోవైపు ఇవాళ ఉదయం భారత వైమానిక దళానికి చెందిన విమానం ఒకటి కాబూల్ నుంచి సుమారు 120 మంది భారతీయ ఎంబసీ సిబ్బందిని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ విమానం జామ్నగర్లో ల్యాండ్ అయ్యింది. కాసేపటి క్రితం మరో విమానంలో ఢిల్లీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.