న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం వరకు 34 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. అయితే ఈ 34 మందిలో 17 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు ప్రకటించారు. కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశారని సత్యేందర్ జైన్ పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను పరిశీలిస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 54 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14 కేసులు నమోదు అయ్యాయి.