బెంగళూరు: కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఒకే స్కూల్లో 32 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొడగు జిల్లాలోని మెడికేరిలో ఉన్న జవహర్ నవోదయా విద్యాలయా రెసిడెన్షియల్ స్కూల్లో 32 మంది విద్యార్థులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు. అందులో 10 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 22 మందికి ఎలాంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. అదేవిధంగా సిబ్బందిలో ఒకరికి కూడా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. బాధితులందరిని జిల్లా దవాఖానకు తరలించామని చెప్పారు.
స్కూల్లో మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారని, వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపల్ పంకజషన్ తెలిపారు. వారి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. క్యాంపస్ మొత్తాన్ని శానిటైజేషన్ చేశామన్నారు.