Odisha : భువనేశ్వర్ : ఒడిశాలోని బాలాసోర్(Balasore) జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. రెండు ఎక్స్ప్రెస్ రైళ్లు ఢీకొన్నఈ ఘటనలో గాయపడిన 300మందిలో 30 మందికి పైగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిస్తోంది. ప్రాణ భయంతో కొందరు బోగీలో చిక్కుకున్నారని, దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కాసేపటికే యశ్వంతపూర్ – ఔరా కూడా ప్రమాదానికి గురైనట్టు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జెనా వెల్లడించాడు.
పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్ప్రెస్(Coromandel Express) ఆ పక్కనే వెళ్తున్న యశ్వంతపూర్ – ఔరా ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టింది. దాంతో, అందులోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించేందుకు 50 అంబులెన్స్లు సరిపోకపోవడంతో.. బస్సులను ఏర్పాటు చేశారు.
Derailment of 12841 Shalimar – Chennai Coromandal Express
================Howrah Help line Number : 033-26382217
Kharagpur Help line Number: 8972073925 & 9332392339
Balasore Help line Number: 8249591559 & 7978418322
Shalimar Help line Number: 9903370746
— South Eastern Railway (@serailwaykol) June 2, 2023
కోల్కతా నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ బహనాగ స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును ఈరోజు రాత్రి 7ః 10 గంటల సమయంలో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొదట 179కి గాయపడ్డారని తెలిసింది. అయితే.. క్షతగాత్రుల సంఖ్య 300లకు పెరిగింది. గాయపడ్డ వారిని హుటాహుటీన సోరో, గోపాల్పూర్, ఖంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించారు.