న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశంలోని టీవీ చానళ్లన్నీ ఇక నుంచి జాతీయ ప్రాముఖ్య వార్తలను ప్రతి రోజు 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సిందే. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ టీవీ చానళ్ల అప్లింకింగ్, డౌన్లింకింగ్ మార్గదర్శకాల్లో పేర్కొన్నది.
ఇందులో.. జాతీయ ఆసక్తి లేదా ప్రజా సామాజిక సేవ సంబంధ వార్తలను కచ్చితంగా ప్రసారం చేయాలని స్పష్టం చేసింది. ఈ నిబంధన స్పోర్ట్స్, వైల్డ్లైఫ్, విదేశీ చానళ్లకు వర్తించదని తెలిపింది. త్వరలోనే దీనిపై సర్క్యులర్ జారీ చేస్తామని, చర్చ కూడా చేపడతామని కేంద్ర సమాచార శాఖ సెక్రటరీ అపూర్వచంద్ర పేర్కొన్నారు.