శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు. బుద్గాం జిల్లాలోని వాటర్హెయిల్ వద్ద ఉగ్రవాదులు తల దాచుకున్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. సాయంత్రం సమయంలో ఆ ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మృతదేహాలతో పాటు భారీగా మందు గుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.