శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు ఏంటివని తెలుసుకుంటున్నామని వెల్లడించారు. కొన్నిసార్లు మిలిటరీ అవసరాలకోసం, కోవర్ట్ ఆపరేషన్ కోసం ప్రైవేటు వాహనాలను ఉపయోగిస్తారని చెప్పారు. అయితే వాటిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వినియోగిస్తామన్నారు.
A #blast took place inside a private hired vehicle at Sedow, #Shopian. 03 soldiers injured & shifted to Hospital. Nature & source (blast due to grenade or already planted IED inside vehicle or malfunctioning of battery) of blast being investigated & will be shared: IGP Kashmir
— Kashmir Zone Police (@KashmirPolice) June 2, 2022
కాగా, వాహనంలో ముందుగానే అమర్చిన ఐఈడీని పేల్చివేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బ్యాటరి పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఫోరెన్సిక్ బృందాలు పరిశోధిస్తున్నాయి.