చండీగఢ్: ఖలిస్థాన్ ఉగ్రవాది (Khalistani Terrorist) పేరుతో ముగ్గురు వ్యక్తులు పంజాబ్ వ్యాపారిని బెదిరించారు. డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు కెనడాకు చెందిన ఖలిస్థాన్ ఉగ్రవాది అర్ష్దీప్ దల్లాతో ఫోన్లో మాట్లాడాలని అతడిని బలవంతం చేశారు. ఇంతలో ఆ షాపులోని సిబ్బంది ఒకరు పోలీసులకు ఫోన్ చేయడంతో ఇద్దరు వ్యక్తులు దొరికిపోయారు. పంజాబ్లోని మోగాలో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం మోగాలోని బట్టల మార్కెట్లో ఉన్న ఒక షాపులోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్దీప్ దల్లా పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. సిబ్బందిలో కొందరి నుంచి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. ఉగ్రవాది దల్లాతో ఫోన్లో మాట్లాడాలని షాపు యజమానిని బెదిరించారు. దీంతో ఆయన చేతులు జోడించి వారిని ప్రాధేయపడ్డాడు.
కాగా, అప్రమత్తమైన సిబ్బందిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న ఏఎస్ఐ సత్నామ్ సింగ్ వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ వ్యక్తులను ఒంటరిగా ఎదుర్కొన్నారు. ఒకడు పారిపోగా మిగతా ఇద్దరిని పట్టుకున్నారు. కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్దీప్ దల్లా అనుచరులని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
In #Moga, three miscreants entered in a garment showroom, threatened the owner and asked him to speak on phone call to gangster #ArshDalla, who was sitting abroad. Patrolling police suddenly came there and caught two people from the spot and the third one managed to escape. pic.twitter.com/eREosuWsqj
— Nikhil Choudhary (@NikhilCh_) October 5, 2023