న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీమాపురిలో గురువారం పేలుడు పదార్ధాలు ఉన్న ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ బ్యాగులో సుమారు మూడు కిలోల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఆ పేలుడు పదార్ధాలను నిర్వీర్యం చేశారు. అయితే ఈ కేసులో ఇంటి ఓనర్ను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ పత్రాలు సమర్పించి అనుమానాస్పద యువకులు సీమాపురిలో ఓ ఇళ్లు కిరాయి తీసుకున్నారు. ఆ వ్యక్తులే పేలుడు పదార్ధాలు తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి ఓనర్ను కాంట్రాక్టర్ ఖాసిమ్గా గుర్తించారు. మూడు రోజుల క్రితం ఆ ఇంటికి పది మంది యువకులు వచ్చినట్లు గుర్తించారు. వాళ్లంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా స్పెషల్ సెల్ పోలీసులు అనుమానాస్పద ఇంటిని పసికట్టారు. అనుమానితుల ఫోటోలను పోలీసులు సేకరించారు.