చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు కంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, పలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. పలు చోట్ల రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి వరకు నుంగంబక్కమ్ ఏరియాలో 177.2 మి.మీ., చెన్నై ఎయిర్పోర్టులో 131.3 మి.మీ., ఎంఆర్సీ నగర్లో 208 మి.మీ., కంచీపురంలో 150 మి.మీ. వర్షపాతం నమోదైంది.
#WATCH | Tamil Nadu: Heavy rainfall causes traffic jam at Chennai's Mount Road
— ANI (@ANI) December 30, 2021
Chennai metro says it has announced to extend service timing by an hour till 12 midnight to enable passengers to reach their homes safely pic.twitter.com/1AJCWQ8lSy