భువనేశ్వర్ : ఒడిశాలోని నౌపాడ జిల్లాలో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. బోడెన్ బ్లాక్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రారంభోత్సవం కార్యక్రమం భద్రతకు సీఆర్పీఎఫ్ జవాన్లు వెళ్లారు. ఈ విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు.. జవాన్లపై కాల్పులు జరిపారు. మావోల కాల్పుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ ఏఎస్ఐలు, కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. ఎదురుకాల్పుల నేపథ్యంలో నౌపాడ జిల్లాలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఆ ఏరియాలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.