న్యూఢిల్లీ: భారత్, సింగపూర్ నౌకా దళాల 28వ సముద్ర ద్వైపాక్షిక విన్యాసాలు విజయవంతమయ్యాయి. ఈ నెల 2 నుంచి 4 వరకు వీటిని నిర్వహించారు. ఇండియన్ నేవీకి చెందిన గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ రణ్విజయ్, ఒక షిప్-బోర్న్ హెలికాప్టర్, ఏఎస్డబ్ల్యూకు చెందిన ఐఎన్ఎస్ కిల్తాన్, ఐఎన్ఎస్ కోరా, పీ8ఐ లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ఈ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్నాయి.