Gas Leakage | గుజరాత్ (Gujarat)లో విషవాయువు పీల్చి 28 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన భరూచ్ జిల్లాలోని జంబూసర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
జిల్లాలోని సరోద్ (Sarod) గ్రామంలో గల పీఐ ఇండస్ట్రీస్లో ( PI Industries)ని ట్యాంక్లో మంటలు చెలరేగడంతో బ్రోమిన్ గ్యాస్ లీకైంది (Gas Leakage). ఆ గ్యాస్ను పీల్చడంతో ప్రజలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఘటన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 2 వేల మంది కార్మికులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా తరలించినట్లు వేదచ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వైశాలి అహిర్ తెలిపారు. ప్రస్తుతం లీకేజీని నియంత్రించినట్లు వెల్లడించారు. అస్వస్థతకు గురైన 28 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Infosys | ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్త.. వేరియబుల్ చెల్లింపులు 80 శాతం వరకు పెంపు
Chandrayaan-3 | ఆదిపురుష్ సినిమా కంటే కూడా చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ!