Infosys | బెంగళూరు, ఆగస్టు 23: ఐటీ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ శుభవార్తను అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను ఉద్యోగుల వేరియబుల్ చెల్లింపులను సరాసరిగా 80 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
ఈ వేరియబుల్ చెల్లింపులను ఆగస్టు నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నది. కంపెనీ ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్లో మానవ వనరుల విభాగ అధిపతి ఈ విషయాన్ని వెల్లడించారు. జూన్తో ముగిసిన తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.5,945 కోట్ల నికర లాభాన్ని గడించింది.