ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం..
లోయలో పడ్డ బస్సు.. 25 మంది మృతి
ఉత్తరకాశీ, జూన్ 5: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో యమునోత్రి వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది చనిపోయారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. యాత్రికులంతా మధ్యప్రదేశ్కు చెందినవారు.
పాట్నా నుంచి యాత్రకు బయల్దేరారు. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో దమ్త దగ్గర బస్సు లోయలో పడింది. ప్రమాదం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు. రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50వేలు ఇస్తామన్నారు. ఘటనపై హోం మంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీతో మాట్లాడారు.