భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటల వరకు 28.18 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. 230 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. 2533 మంది ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఓ పోలింగ్ బూత్ లో మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడికి చేదు అనుభవం ఎదురైంది. కమల్నాథ్ కుమారుడు ఎంపీ నాకుల్ నాథ్ను అడ్డుకున్నారు. చింద్వారాలోని బరారిపురాలో ఉన్న పోలింగ్ బూత్లో ఆయన ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న బీజేపీ వర్కర్లు ఎంపీ నాకుల్ నాథ్ను బూత్లోకి వెళ్లకుండా నియంత్రించారు.
#WATCH | Congress MP Nakul Nath, who is also the son of former Madhya Pradesh CM Kamal Nath was allegedly stopped from entering a polling booth in Bararipura, Chhindwara by BJP workers. pic.twitter.com/SwS4RClW7D
— ANI (@ANI) November 17, 2023
మధ్యప్రదేశ్లో 47 స్థానాలను ఎస్టీ, 35 స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనున్నది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన బాలాఘాట్, మండ్ల, దిందోరి జిల్లాలో కేవలం 3 గంటల వరకే పోలింగ్ జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 64, 626 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు.